మహిళా ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

సరోగసీ విధానం ద్వారా సంతానం పొందే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు పొందే అవకాశం లభించింది.

By అంజి  Published on  24 Jun 2024 11:57 AM GMT
Central Govt, maternity leave, surrogacy

మహిళా ఉద్యోగులకు కేంద్రం శుభవార్త

సరోగసీ విధానం ద్వారా సంతానం పొందే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు పొందే అవకాశం లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైల్డ్‌ కేర్‌ లీవ్‌తో అద్దె గర్భంలో బిడ్బలను పొందే తల్లిదండ్రులకు హక్కు కల్పిస్తూ కేంద్రం.. సెంట్రల్‌ సివిల్‌ సర్వీసెస్‌ (లీవ్‌) రూల్స్‌ (1972), 50 ఏళ్ల నాటి నిబంధనకు సవరణలు ప్రకటించింది. దీని ప్రకారం మహిళా ఉద్యోగులు 180 రోజులు ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. తండ్రులు కూడా 15 రోజులపాటూ పితృత్వ సెలవులను తీసుకోవచ్చు.

సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సెలవు) రూల్స్‌ 1972లో చేసిన మార్పుల ప్రకారం.. "కమిషనింగ్ ఫాదర్"కి 15 రోజుల పితృత్వ సెలవుతో పాటు శిశు సంరక్షణ సెలవుతో పాటు "కమిషనింగ్ మదర్" (గర్భంలోని బిడ్డను స్వీకరించే తల్లి)కు సెలవులు ఇస్తూ అనుమతించింది. సరోగసీ ద్వారా బిడ్డ పుడితే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధనలు ఇప్పటి వరకు లేవు. అయితే తాజాగా కేంద్రం మహిళా ఉద్యోగులకు ఈ విధమైన ప్రసూతి సెలవులు కల్పించింది.

ఇద్దరు కంటే తక్కువ పిల్లలున్న ప్రభుత్వ ఉద్యోగి తల్లికి కూడా ఈ సెలవులు లభిస్తాయి. సరోగసీ విధానం ద్వారా తండ్రిగా మారిన వారికి కూడా సెలవులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అంటే బిడ్డకు జన్మించిన ఆరు నెలల్లోపు 15 రోజుల పాటు పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. అయితే అతడికి కూడా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదని షరతు విధించింది. సవరించిన కొత్త రూల్స్ జూన్​ 18నుంచి అమల్లోకి వచ్చాయి.

Next Story