క్రికెటర్ల కుమార్తెలపై అసభ్యకర పోస్టులు.. మహిళ కమిషన్‌ చర్యలు

Book people behind misogynistic posts against daughters of cricketers.. DCW. న్యూఢిల్లీ: క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లిల భార్యలు, కుమార్తెలను లక్ష్యంగా చేసుకుని సోషల్‌

By అంజి
Published on : 12 Jan 2023 5:31 PM IST

క్రికెటర్ల కుమార్తెలపై అసభ్యకర పోస్టులు.. మహిళ కమిషన్‌ చర్యలు

న్యూఢిల్లీ: క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లిల భార్యలు, కుమార్తెలను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో 'స్త్రీద్వేషపూరిత' పోస్టులు చేసిన వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) నగర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇద్దరు ప్రఖ్యాత క్రికెటర్ల ఏడేళ్ల, రెండేళ్ల కుమార్తెలను లక్ష్యంగా చేసుకుని కొందరు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తున్నారని పేర్కొంది. దీనికి సంబంధించిన పోస్టులను తానే స్వయంగా తీసుకున్నట్లు ప్యానెల్ తెలిపింది.

''సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్విట్టర్'లో ఈ పోస్ట్‌లు చిన్నపిల్లలు, వారి తల్లుల పట్ల అసభ్యకరంగా, స్త్రీద్వేషపూరితంగా, అత్యంత నీచంగా దుర్భాషలాడుతున్నాయి. ఇది చాలా తీవ్రమైన విషయం, అత్యవసర చర్యను ఆకర్షిస్తుంది'' అని బాడీ నోటీసులో పేర్కొంది. జనవరి 16లోగా ఈ విషయంపై సవివరమైన చర్య తీసుకున్న రిపోర్టును ఇవ్వాలని కోరింది. బుధవారం కూడా ఈ సమస్యపై మలివాల్ ట్వీట్ చేశారు.

''కొన్ని సోషల్‌ మీడియా ఖాతాలు.. దేశంలోని ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ధోనీల కుమార్తెల చిత్రాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. రెండేళ్లు, ఏడేళ్ల బాలికలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయి'' అంటూ మలివాల్‌ ట్వీట్ చేశారు. '' మీకు మహిళలు నచ్చకపోతే వాళ్ల కూతురిని దుర్భాషలాడతారా? ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయమని పోలీసులకు నోటీసులు జారీ చేస్తున్నాం'' అని ఆమె హిందీలో ట్వీట్‌ చేశారు.


Next Story