భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్‌ సమీర్‌ రాజీనామా

BharatPe CEO Suhail Sameer Steps Down. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ సంస్థ భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్‌ సమీర్‌ రాజీనామా చేశారు.

By M.S.R
Published on : 3 Jan 2023 7:00 PM IST

భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్‌ సమీర్‌ రాజీనామా

ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ సంస్థ భారత్‌పే సీఈఓ పదవికి సుహైల్‌ సమీర్‌ రాజీనామా చేశారు. తాత్కాలిక సీఈఓగా ప్రస్తుత సీఎఫ్‌ఓ నలిన్‌ నేగీని సంస్థ నియమించింది. సుహైల్‌ సమీర్‌ ఈ నెల 7 నుంచి భారత్‌పే వ్యూహాత్మక సలహాదారుగా వ్యవహరించనున్నారు. భారత్‌పే మాజీ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన స్థానంలో 2022 మార్చిలో సుహైల్ సమీర్ నియమితులయ్యారు. తనపై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణల నేపథ్యంలో అష్నీర్ గ్రోవర్ కంపెనీకి రాజీనామా చేశారు. కంపెనీ సీఈఓ పదవికి సుహైల్ సమీర్ రాజీనామా చేసినట్లు భారత్‌పే ఒక ప్రకటనలో తెలిపింది. ఇక జనవరి 7 నుంచి సమీర్ కంపెనీకి స్ట్రాటజిక్‌ అడ్వైజర్‌గా కొనసాగుతారు. గత నెలలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విజయ్ అగర్వాల్, పోస్ట్‌పే హెడ్ నెహుల్ మల్హోత్రా, లెండింగ్ అండ్‌ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రజత్ జైన్ కంపెనీకి రాజీనామా చేశారు. కంపెనీ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ నిషిత్ శర్మ జూన్‌లో రాజీనామా చేశారు.


Next Story