సర్కార్‌ ఏర్పాటు చేసేందుకు.. రేపు గవర్నర్‌ను కలవనున్న భగవంత్‌ మాన్‌

Bhagwant Mann to meet Guv tomorrow to stake claim to form govt in Punjab. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మార్చి 12, శనివారం నాడు పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్

By అంజి  Published on  11 March 2022 5:14 AM GMT
సర్కార్‌ ఏర్పాటు చేసేందుకు.. రేపు గవర్నర్‌ను కలవనున్న భగవంత్‌ మాన్‌

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మార్చి 12, శనివారం నాడు పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ను కలవనున్నారు. ప్రస్తుత సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ శుక్రవారం తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించనున్నారు. ఉదయం 11.30 గంటలకు కేబినెట్ సమావేశం అనంతరం చన్నీ తన రాజీనామాను సమర్పించనున్నారు. భగవంత్‌ మన్ శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలవనున్నారు. "మేము భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలాన్‌లో ప్రమాణం చేస్తాము. ఈ రోజు సాయంత్రంలోగా ప్రమాణస్వీకార కార్యక్రమం తేదీ తెలుస్తుందని అన్నారు. 117 సీట్ల పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 92 సీట్లు గెలుచుకుందని'' అన్నారు. ఆప్‌ శాసనసభ సమావేశపు మొదటి సమావేశం గురించి అడిగిన ప్రశ్నపై భగవంత్‌ మన్ ఇలా అన్నాడు. మేము చేస్తాం, మా శాసనసభ్యులు రాజస్థాన్‌కు వెళ్లవలసిన అవసరం లేదు.

2020లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వేటాడి తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 'వీళ్లు సిగ్గులేని వ్యక్తులు.. వారి సిగ్గులేనితనానికి ఓ హద్దు ఉంటుంది. గుజరాత్‌లో ఏడుగురు ఎమ్మెల్యేలను ఎత్తుకెళ్లి రెండు సీట్లు సంపాదించారు. రాజస్థాన్‌లో కూడా అదే విధంగా ప్రయత్నించారు, కానీ మేము వారి ప్రయత్నాలను అడ్డుకున్నాం అని గెహ్లాట్ అప్పుడు చెప్పారు. పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ శాసనసభ్యులను జైపూర్‌లోని హోటల్‌కు తరలించారు. తమ ఎమ్మెల్యేలను వేటాడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నానికి నిదర్శనంగా కాంగ్రెస్ ఆడియో క్లిప్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఈ ఆరోపణలన్నింటినీ కొట్టిపారేసిన బీజేపీ, కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఫిర్యాదు చేసింది.

Next Story