300 సీట్లు వస్తే రామమందిరాన్ని నిర్మించాం.. 400 వ‌స్తే..

బీజేపీకి 300 సీట్లు వస్తే అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించామని.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే కృష్ణజన్మభూమిలో దేవాలయం నిర్మిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.

By Medi Samrat  Published on  15 May 2024 5:41 AM GMT
300 సీట్లు వస్తే రామమందిరాన్ని నిర్మించాం.. 400 వ‌స్తే..

బీజేపీకి 300 సీట్లు వస్తే అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించామని.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే కృష్ణజన్మభూమిలో దేవాలయం నిర్మిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. అలాగే.. ప్రధాని మోదీ నాయకత్వంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)కూడా వెనక్కి తీసుకోబడుతుందని అన్నారు.

తూర్పు ఢిల్లీ లోక్‌సభ బిజెపి అభ్యర్థి హర్ష్ మల్హోత్రాకు మద్దతుగా ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 కంటే ఎక్కువ సీట్లు వస్తే.. మథురలో గొప్ప దేవాలయాన్ని నిర్మిస్తామని అన్నారు. కాశీలో జ్ఞాన్వాపి స్థానంలో గొప్ప ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. దేశంలో మొఘలులు ఎన్నో దోపిడీలు చేశారని అన్నారు. వాటిలో చాలా వరకు ఇంకా క్లియర్ కావాల్సి ఉంది.

హిమంత శర్మ మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఒక కశ్మీర్ భారతదేశంలో.. మరొకటి పాకిస్థాన్‌లో ఉందని మాకు చెప్పబడింది. పీఓకే మాది అని పార్లమెంటులో ఎప్పుడూ చర్చ జరగలేదు. ప్రస్తుతం పీఓకేలో ప్రతిరోజూ నిరసనలు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లోని ప్రజలు భారత త్రివర్ణ పతాకంతో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మోదీజీకి 400 సీట్లు వస్తే పీఓకే కూడా భారత్‌లో భాగమవుతుందన్నారు.

గత కొన్ని రోజులుగా పీఓకేలో పెద్దఎత్తున నిరసనలు జరగడం గమనార్హం. పిండి ధరలు పెరగడం, కరెంటు బిల్లుల రేట్లు పెరగడం, సబ్సిడీలు తగ్గించడం వంటి డిమాండ్లతో పీఓకే ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వస్తున్నారని అన్నారు.

దేశంలో రిజర్వేషన్ల పటిష్టతకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని అస్సాం సీఎం అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి అని ఆయన అన్నారు. గత పదేళ్లుగా బీజేపీ అధికారంలో ఉందని.. రిజర్వేషన్ల బలోపేతానికి మా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Next Story