బెంగళూరులో దారుణం..అర్ధరాత్రి తలుపుతట్టి మహిళపై గ్యాంగ్‌రేప్‌

బెంగళూరు నగర పరిధిలో మరో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది.

By -  Knakam Karthik
Published on : 23 Oct 2025 8:02 AM IST

National News, Bengaluru, Kolkata woman gang-raped

బెంగళూరులో దారుణం..అర్ధరాత్రి తలుపుతట్టి మహిళపై గ్యాంగ్‌రేప్‌

బెంగళూరు నగర పరిధిలో మరో ఘోర సంఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి ఒక మహిళపై ఐదుగురు వ్యక్తులు దారుణంగా దాడి చేసి గ్యాంగ్‌రేప్‌ చేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. సమాచారం ప్రకారం, ఈ ఘటన మదనాయకనహಳ್ಳಿ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రాత్రి 9.30 నుంచి అర్థరాత్రి 12.15 గంటల మధ్య జరిగింది. నిందితులు మద్యం సేవించి, బాధితురాలి అద్దె ఇంటికి వచ్చి తలుపు తట్టారు. ఆమె తలుపు తెరిచిన వెంటనే బలవంతంగా లోపలికి దూసుకెళ్లి, మరో గదికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.

తర్వాత వారు ఆమె వద్ద ఉన్న రెండు మొబైల్‌ ఫోన్లు, రూ.25,000 నగదును దోచుకున్నారు. బాధితురాలు కోల్‌కతాకు చెందినది కాగా, బెంగళూరులో అద్దె ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బెంగళూరు రూరల్‌ ఎస్పీ సి.కె. బాబా మాట్లాడుతూ, “ఘటన రాత్రి 9.30 నుంచి 12.15 మధ్య జరిగింది. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశాము. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని గుర్తించి అరెస్ట్‌ చేయడానికి గాలింపు కొనసాగుతోంది,” అని తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Next Story