విమాన ప్రమాదం నుంచి ఎలా బతికానో తెలియడం లేదని మృత్యుంజయుడు రమేశ్ విశ్వాస్ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ప్రమాదం తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు. 'టేకాఫ్ అయిన 30 సెకన్ల తర్వాత విమానం పెద్ద శబ్దంతో కూలిపోయింది. నేను స్పృహలోకి వచ్చేసరికి చుట్టూ మృతదేహాలున్నాయి. విమానం ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఎవరో నన్ను అంబులెన్స్లో ఎక్కించారు. నా సోదరుడూ విమానంలో ప్రయాణించాడు' అని అన్నారు.
విమాన ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్ను ప్రధాని మోదీ కలిసి పరామర్శించిన విషయం తెలిసిందే. సివిల్ ఆస్పత్రికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. విమానంలో ఏం జరిగింది? ఎలా బయటపడ్డారు? వంటి విషయాలను ఆరా తీసినట్టు సమాచారం.. రమేష్ చెప్పిన విషయాలను మోదీ సావధానంగా విన్నారు.
విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విడిపోయిందని, తన సీటు శిథిలాల నుండి దూరంగా ఎగిరిపోయిందని ఆయన చెప్పారు. ఫలితంగా, విమానంలోని మిగిలిన భాగాలను దహించిన మంటల నుండి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. తాను విమానం నుంచి దూకలేదని, విమానం ముక్కలైపోయినప్పుడు సీటుకు కట్టి ఉంచి బయటకు విసిరివేయబడ్డానని రమేష్ వైద్యులకు చెప్పాడు. అతను గాయాలతో కనిపించాడు మరియు ట్రామా వార్డులో పరిశీలనలో ఉన్నాడు.
అటు నిన్న అహ్మదాబాద్ విమాన ప్రమాద వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్టు ప్రధాని మోదీ మరోసారి తెలిపారు. ఇవాళ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన తర్వాత ఆయన మాట్లాడారు. 'బాధిత కుటుంబాల పరిస్థితిని అర్థం చేసుకున్నా. ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలం ఉంటుందని తెలుసు. వారి బాధను మాటల్లో చెప్పలేను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా' అని వ్యాఖ్యానించారు.