కేరళకు చెందిన 29 ఏళ్ల ఇంజనీర్ దుబాయ్లో స్కూబా డైవింగ్ సెషన్లో మరణించాడు. నీటి అడుగున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన తర్వాత బాధితుడికి గుండెపోటు వచ్చిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన బాధితుడు ఐజాక్ పాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్లోని జుమేరా బీచ్లో గడుపుతున్నారు. కాగా అక్కడ స్కూబా డైవింగ్ పార్టిసిపేట్ చేసి మృత్యువాత పడ్డాడు.
నీటి అడుగున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన తర్వాత గుండె పోటుకు గురయ్యాడని మృతుడి బంధువు తెలిపారు. ఐజాక్ యూఏఈలో ఇంజినీర్గా పని చేస్తున్నాడు. దుబాయ్లోని నియమించబడిన స్కూబా డైవింగ్ ప్రాంతంలో శిక్షణా సెషన్లో ఈ సంఘటన జరిగిందని ఐజాక్ మామ డేవిడ్ తెలిపారు. ఆయన చట్టపరమైన విధానాలలో కుటుంబానికి సహాయం చేస్తున్నారు.