న‌దిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది జ‌ల‌స‌మాధి

9 Dead As Car Is Swept Away In Uttarakhand River.ఉత్త‌రాఖండ్‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. కారు న‌దిలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 July 2022 5:55 AM GMT
న‌దిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది జ‌ల‌స‌మాధి

ఉత్త‌రాఖండ్‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. కారు న‌దిలో కొట్టుకుపోయింది. ఈ ఘ‌ట‌న‌లో 9 మంది మ‌ర‌ణించారు. మ‌రో ఇద్ద‌రు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న నైనిటాల్ జిల్లాలోని రామ్‌న‌గ‌ర్ ప్రాంతంలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్క‌డ ఉన్న ధేలా నది ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తోంది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున రామ్‌న‌గ‌ర్ వ‌ద్ద ధేలా నది వంతెనపై వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారు నీటిలో కొట్టుకుపోయింది. ఆ స‌మ‌యంలో కారులో 11 మంది ఉన్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో వారిని బ‌య‌ట‌కు తీయ‌గా.. 9 మంది మ‌ర‌ణించిన‌ట్లు పోలీసులు తెలిపారు. బాలిక‌తో పాటు మ‌రోక‌రు సుర‌క్షితంగా ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. కాగా..వీరంతా పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు.

Next Story