యమునా నదిని ఈదిన బాలిక.. కేవలం 11 నిమిషాల్లోనే
కేవలం 11 నిమిషాల్లో యమునా నదిని దాటిన ఆరేళ్ల బాలిక తన విజయగాథను ప్రపంచానికి చూపించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో
By అంజి Published on 30 May 2023 2:15 PM IST
యమునా నదిని ఈదిన బాలిక.. కేవలం 11 నిమిషాల్లోనే
కేవలం 11 నిమిషాల్లో యమునా నదిని దాటిన ఆరేళ్ల బాలిక తన విజయగాథను ప్రపంచానికి చూపించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని ప్రీతం నగర్లో నివాసం ఉంటున్న వృతికా శాండిల్య తన ఫీట్తో తన శిక్షకులను ఆశ్చర్యపరిచింది. సెయింట్ ఆంథోనీ గర్ల్స్ కాన్వెంట్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న విద్యార్థిని వృతిక తన శిక్షకుల మార్గదర్శకత్వంలో ఉదయం 6:10 గంటలకు మీరాపూర్ సింధు సాగర్ ఘాట్ నుండి ఈత కొట్టడం ప్రారంభించి నదిని దాటి 6.21 గంటలకు విద్యాపీఠ్ మహేవాఘాట్ వద్ద నదికి మరొక వైపుకు చేరుకుంది.
ఆమె మాస్టర్ ట్రైనర్ త్రిభువన్ నిషాద్ మాట్లాడుతూ.. ఆమె స్విమ్మింగ్ నేర్చుకున్న మొదటి రోజు నుండి కష్టపడి నదిని దాటాలని నిశ్చయించుకుంది. వృతికా మొదట ప్రసిద్ధ మాతా లలితా దేవి ఆలయం, లార్డ్ హనుమాన్ దేవాలయం (బర్గద్ ఘాట్) వద్ద ప్రార్థనలు చేసింది. నదిని దాటడానికి తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు తన శిక్షకుడు కమల నిషాద్ నుండి ఆశీర్వాదం కోరింది. ఆమె కేవలం 11 నిమిషాల్లో యమునా నదిని దాటింది. అయితే ఆమె వయస్సు పిల్లలు అంతకుముందు 15 లేదా అంతకంటే ఎక్కువ నిమిషాలు సమయం తీసుకుని నదిని దాటారు.
"వృతిక నదిని దాటుతున్నప్పుడు, ఆమె తల్లిదండ్రులు, పంకజ్ కుమార్ సింగ్, నివేదాతా సింగ్, తాతలు, ఇతరులు ఆమెను ప్రోత్సహించారు, ఉత్సాహపరిచారు." అని నిషాద్ తెలిపారు. అత్యవసర సహాయం కోసం మూడు పడవలు బాలికను వెంబడించాయని నిషాద్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని నవజీవన్ స్విమ్మింగ్ క్లబ్లో ప్రస్తుతం 150 మంది పిల్లలు అన్ని వయసుల వారు శిక్షణ పొందుతున్నారు. 3 నుండి 8 సంవత్సరాల వయస్సు గల శిక్షణ పొందిన స్విమ్మర్లలో వృతిక ఒకరు, ఈ ఘనతను సాధించి ప్రశంసలు అందుకుంటున్నారు.