ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు.

By అంజి
Published on : 13 Dec 2024 6:51 AM IST

fire, private hospital, Tamil Nadu, Dindigul

ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. సీనియర్ ప్రభుత్వ అధికారి ప్రకారం.. కనీసం 29 మంది రోగులను ప్రైవేట్ ఆసుపత్రి నుండి డిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక, రక్షణ చర్యలను పర్యవేక్షించారు.

"రెండు గంటల క్రితం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఇక్కడ ఉన్న రోగులను రక్షించి సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చేర్చారు. కొంత మంది ప్రాణనష్టం ఉండవచ్చు, అయితే మేము మరణాల సంఖ్యను వైద్యులు ధృవీకరించిన తర్వాత మాత్రమే నిర్ధారిస్తాము" దిండిగల్ జిల్లా కలెక్టర్ ఎంఎన్ పూంగోడి వార్తా సంస్థ ఏఎన్‌ఐతో చెప్పారు.

అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడం కనిపించింది. "మేము పరిస్థితిని నియంత్రించడానికి, ఆస్పత్రిలో ఉన్న ప్రతి ఒక్కరి భద్రతను నిర్ధారించడానికి కృషి చేస్తున్నాము" అని అగ్నిమాపక - రెస్క్యూ విభాగానికి చెందిన సీనియర్ అధికారి తెలిపారు. ఆసుపత్రికి చెందిన ఒక అధికారి, "పరిస్థితిని అంచనా వేస్తున్నారు. మేము అత్యవసర ప్రతిస్పందనదారులకు సహకరిస్తున్నాము" అని చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, నష్టం ఎంత అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story