నిరసనలు చేశారని.. 58 మంది పాఠశాల విద్యార్థులు సస్పెండ్

58 students of Karnataka school suspended for holding protests in Shivamogga. కర్ణాటక రాష్ట్రంలోని శిరాలకొప్ప తాలూకాలోని శివమొగ్గ జిల్లాలో హిజాబ్‌పై ఆంక్షలకు వ్యతిరేకంగా శుక్రవారం నిరసనలు

By అంజి  Published on  19 Feb 2022 5:47 AM GMT
నిరసనలు చేశారని.. 58 మంది పాఠశాల విద్యార్థులు సస్పెండ్

కర్ణాటక రాష్ట్రంలోని శిరాలకొప్ప తాలూకాలోని శివమొగ్గ జిల్లాలో హిజాబ్‌పై ఆంక్షలకు వ్యతిరేకంగా శుక్రవారం నిరసనలు చేపట్టిన పాఠశాలకు చెందిన 58 మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. క్లాస్‌రూమ్‌లోకి హిజాబ్‌ను అనుమతించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు. హిజాబ్ మా హక్కు, చనిపోతాం కానీ హిజాబ్‌ను వదులుకోబోమని విద్యార్థులు తెలిపారు. సస్పెన్షన్‌ను రద్దు చేసే వరకు విద్యార్థులను క్యాంపస్ ప్రాంగణంలోకి అనుమతించమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

కాగా ఇతర నిరసనకారులపై కూడా సీఆర్‌పీసీ సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేయబడింది. గత మూడు రోజులుగా పోలీసులు, తహసీల్దార్ విద్యార్థులకు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. గురువారం సిఆర్‌పిసి సెక్షన్ 144 కింద శివమొగ్గ జిల్లా అధికార యంత్రాంగం జారీ చేసిన నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేయబడ్డాయి. బురఖాతో ఉన్న ముస్లిం యువతులను క్యాంపస్‌లోకి రానివ్వనందుకు జిల్లా కేంద్రంలోని పీయూ కళాశాల అధికారులపై వారు నిరసనలు చేపట్టారు.

హిజాబ్ ధరించడానికి నిరాకరించినందుకు గెస్ట్ లెక్చరర్ రాజీనామా

తుమకూరులోని ప్రైవేట్ ప్రీ-యూనివర్శిటీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ హిజాబ్ ధరించవద్దని లేదా మతపరమైన చిహ్నాన్ని ప్రదర్శించవద్దని కోరడంతో ఆమె రాజీనామా చేసింది. అయితే, కాలేజీ యాజమాన్యం మాత్రం అలాంటిదేమీ లేదని పేర్కొంటూ ఆరోపణలను తోసిపుచ్చింది. గత మూడేళ్లుగా ఓ ప్రైవేట్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్‌గా ఇంగ్లీష్ బోధిస్తున్న చాందిని, ప్రిన్సిపాల్ తనను పిలిపించి, ఎవరూ హిజాబ్ ధరించి లేదా మతపరమైన గుర్తింపును ప్రదర్శించకూడదని ఆదేశాలు వచ్చాయని చెప్పారు. హిజాబ్ అనేది ఇస్లాం మతానికి అవసరమైన మతపరమైన ఆచారం కాదని, దాని వినియోగాన్ని నిరోధించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25ను ఉల్లంఘించదని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

Next Story