విషాదం.. సిలిండర్‌ పేలి ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో సోమవారం ఓ ఇంట్లో సిలిండర్ పేలిన ఘటనలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు చనిపోయారు.

By అంజి
Published on : 22 Oct 2024 8:00 AM IST

killed , cylinder blast, Uttar Pradesh, Bulandshahr

విషాదం.. సిలిండర్‌ పేలి ఐదుగురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో సోమవారం ఓ ఇంట్లో సిలిండర్ పేలిన ఘటనలో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు చనిపోయారు. పేలుడు ధాటికి ఇంటిలో కొంత భాగం కుప్పకూలిందని, మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికంద్రాబాద్ పరిధిలో రాత్రి 8:30 నుంచి 9:00 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది.

బులంద్‌షహర్ జిల్లాలోని సికంద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీలో పేలుడు కారణంగా ఐదుగురు మరణించారని, శిథిలాల కింద కొందరు చిక్కుకుపోయారని మాకు సమాచారం అందిందని మీరట్ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ధ్రువ కాంత్ థాకు తెలిపారు. పేలుడు జరిగిన సమయంలో ఇంట్లో దాదాపు 18 నుంచి 19 మంది ఉన్నారని బులంద్‌షహర్ జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర ప్రకాశ్ సింగ్ తెలిపారు.

ఎనిమిది మంది వ్యక్తులను రక్షించి ఆసుపత్రికి తరలించామని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి చాలా విషమంగా ఉందని ఆయన తెలిపారు. ఫిరోజాబాద్‌లో గత నెలలో ఇదే విధమైన సంఘటన జరిగింది , అక్కడ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా ఇల్లు కూలి ఐదుగురు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు.

Next Story