జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

3 LeT terrorists killed in Pulwama Encounter.జమ్ము‌క‌శ్మీ‌ర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొన‌సాగుతోంది. శ‌నివారం రాత్రి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jun 2022 5:42 AM GMT
జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంట‌ర్‌.. ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

జమ్ము‌క‌శ్మీ‌ర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొన‌సాగుతోంది. శ‌నివారం రాత్రి పుల్వామాలోని ద‌ర్భ్‌గ్రామ్ వ‌ద్ద భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. దాదాపు 12 గంట‌ల పాటు కాల్పులు జ‌రిగాయి. వారంతా ల‌ష్క‌రే తొయీబాకు చెందిన ఉగ్ర‌వాదుల‌ని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. వారిని ఫాజిల్ నజీర్‌ భట్‌, ఇర్ఫాన్‌ మాలిక్‌, జునైద్‌ షీర్గోజ్రీగా గుర్తించారు.

'మ‌ర‌ణించిన ముగ్గురు ఉగ్ర‌వాదులు స్థానికులే, వీరంతా ల‌ష్క‌రే తొయిబా గ్రూప్‌న‌కు చెందిన‌వారిగా గుర్తించాం. వీరిలో జునైద్ అనే ఉగ్ర‌వాది గ‌తంలో క‌శ్మీరీ పోలీస్‌కు చెందిన రియాజ్ అహ్మ‌ద్ ను హ‌త్య చేశాడు' అని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్ తెలిపారు. వీరి వ‌ద్ద నుంచి రెండు ఏకే -47లు, ఒక పిస్తోల్‌, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు.

ఇటీవ‌ల ఉగ్ర‌వాద సంస్థ‌లు పంతా మార్చిన‌ట్లు క‌నిపిస్తోంది. స్థానికుల‌నే ఎగ‌దోసి దాడుల‌కు పాల్ప‌డేట‌ట్లు చేస్తున్నాయి. ఇందుకోసం ఆన్‌లైన్ శిక్ష‌ణను ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ఎన్‌కౌంట‌ర్ల‌లో ఎక్కువ‌గా స్థానిక ఉగ్ర‌వాదులే ఉండ‌డం క‌నిపిస్తోంది.

Next Story