దారుణం.. మూసిఉన్న కంటైనర్లో 29 ఆవులు మృతి
29 Cows Found Dead in a Stranded Container in Mathura.పోలీసులు ఆ కంటైనర్ను తెరిచి చూసి షాకైయ్యారు.
By తోట వంశీ కుమార్
జాతీయ రహదారికి సమీపంలో ఓ కంటైనర్ చాలా సేపుగా నిలిచి ఉండటాన్ని స్థానికులు గమనించారు. అనుమానం వచ్చి వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ కంటైనర్ను తెరిచి చూసి షాకైయ్యారు. ఆ కంటైనర్లో 29 ఆవులు మరణించి ఉన్నాయి. ఓ ఆవు సజీవంగా ఉంది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మథుర జిల్లాలో చోటు చేసుకుంది.
Uttar Pradesh | We received info that a closed container is standing near the national highway in Mathura district. 29 cows were found dead while one cow was found alive in the container. The driver has been absconding. Case filed: Harshita Singh, CO, Refinery, Mathura pic.twitter.com/wadKWrHg47
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 25, 2022
మధుర సర్కిల్ ఆఫీసర్ (సిఓ) హర్షిత సింగ్ ఈ ఘటనపై స్పందించారు. మథుర జిల్లాలోని జాతీయ రహదారికి సమీపంలో మూసి ఉన్న కంటైనర్ చాలా సేపుగా అక్కడే ఉన్నట్లు మాకు సమాచారం అందింది. మేము అక్కడి వెళ్లి చూడగా.. కంటైనర్లో 29 ఆవులు చనిపోగా, ఒక ఆవు సజీవంగా కనిపించింది. ఈ విషయం తెలిసే డ్రైవర్ కంటైనర్ను అక్కడే వదిలేసి పారిపోయినట్లుగా ఉన్నాడు. " దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హర్షిత సింగ్ తెలిపారు.