జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ జరిపిన దాడుల్లో 16 మంది అమాయక భారతీయ ప్రజలు మరణించినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు. నిన్నటి నుంచి జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్ రాజౌరి సెక్టార్లలోని ప్రాంతాలలో పాకిస్తాన్ మోర్టార్లు, భారీ క్యాలిబర్ ఆర్టిలరీలను ఉపయోగించింది అని తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల తీవ్రతను పెంచింది. పాకిస్తాన్ కాల్పులకు భారత సైన్యం దీటుగా బదులిస్తోంది..అని వ్యోమికా సింగ్ పేర్కొన్నారు.