కల్తీ మద్యం సేవించి 13 మంది మృతి.. 9 మంది అరెస్ట్.. నలుగురు పోలీసుల సస్పెన్షన్

తమిళనాడులో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో కల్తీ మద్యం సేవించి 13 మంది మరణించారు. పలువురు ఆసుపత్రి పాలయ్యారు.

By అంజి  Published on  15 May 2023 8:00 AM GMT
liquor, Tamil Nadu,  Villupuram, Crime news

కల్తీ మద్యం సేవించి 13 మంది మృతి.. 9 మంది అరెస్ట్.. నలుగురు పోలీసుల సస్పెన్షన్

తమిళనాడులో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో కల్తీ మద్యం సేవించి 13 మంది మరణించారు. పలువురు ఆసుపత్రి పాలయ్యారు. విల్లుపురం జిల్లా మరక్కానంలో తొమ్మిది మంది, చెంగల్‌పట్టు జిల్లా మదురాంతకం వద్ద కల్తీ మద్యం సేవించి నలుగురు మృతి చెందారు. దీంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. కల్తీ మద్యం, గుట్కా తయారు చేసి సరఫరా చేసిన 9 మందిపై పోలీసులు 57 కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ రెండు ఘటనల మధ్య సంబంధానికి సంబంధించిన ఆధారాలు పోలీసులకు లభించాల్సి ఉంది.

"ప్రస్తుతం రెండు డజన్ల మందికి పైగా ప్రజలు చికిత్స పొందుతున్నారు. వారు బాగానే ఉన్నారు" అని అధికారులు తెలిపారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (నార్త్) ఎన్ కన్నన్ మాట్లాడుతూ.. బాధితులు ఇథనాల్-మిథనాల్ పదార్ధం కలిపిన నకిలీ మద్యం సేవించి ఉండవచ్చన్నారు.

"ఇంతకుముందు చెంగల్పట్టు జిల్లాలో ఐదుగురు ఆసుపత్రి పాలయ్యారు. వారిలో నలుగురు చికిత్స పొందుతూ మరణించారు. శవపరీక్ష జరిగింది. చెంగల్పట్టు సంఘటనకు సంబంధించి నిందితుడు అమ్మవసాయిని అరెస్టు చేశారు. రెండు సంఘటనలలో కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారు. ప్రత్యేక బృందాలు నిందితులను పట్టుకునేందుకు ఏర్పాటు చేశాం. రెండు కేసుల్లోనూ పారిశ్రామిక అవసరాలకు వినియోగించే మద్యాన్ని వినియోగించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రెండు జిల్లాల నుంచి ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు సబ్-ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేశాం'' అని కన్నన్ తెలిపారు.

పరిహారం ప్రకటించిన సీఎం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యం సేవించడం వల్ల మరణాలు సంభవించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబానికి రూ.10 లక్షలు, ఆస్పత్రిలో చేరిన వారికి రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. నలుగురు పోలీసు అధికారులు - మరక్కాణం ఇన్‌స్పెక్టర్ అరుల్ వడివళగన్, సబ్-ఇన్‌స్పెక్టర్ దీబన్, కొత్తకుప్పం ప్రొహిబిషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మరియ సోఫీ మంజుల, సబ్-ఇన్‌స్పెక్టర్ శివగురునాథన్‌లను సస్పెండ్ చేసినట్లు సిఎం తెలిపారు.

Next Story