భారత్: కరోనాపై కేంద్రం హెల్త్‌ బులిటెన్‌ విడుదల

By సుభాష్  Published on  19 April 2020 11:16 AM GMT
భారత్: కరోనాపై కేంద్రం హెల్త్‌ బులిటెన్‌ విడుదల

కరోనా వైరస్‌ దేశంలో విజృంభిస్తోంది. చాపకింద నీరులా ప్రవహిస్తున్న కరోనా వైరస్‌.. దేశంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1334 కేసులు నమోదు కాగా, 27 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

ఇక కరోనాతో మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకూ 507కి చేరింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,712కి చేరగా, ఇప్పటి వరకూ 2,231 మంది కోలుకున్నారని పేర్కొన్నారు.

ఇప్పటి వరకూ 3.86 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశామన్నారు. గత 24 గంటల్లో 37వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.

దేశంలో 73 శాతం కరోనాతో మరణించిన వారు 60 ఏళ్లకుపైబడిన వారు ఉన్నారని అన్నారు. ఇక దేశ వ్యాప్తంగా సంచలన సృష్టంచిన ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రార్థనల గురించి లవ్‌ అగర్వాల్‌ పలు వివరాలు తెలియజేశారు. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 4,291 మర్కజ్‌కు సంబంధించినవేనిన స్పష్టం చేశారు. అత్యధికంగా తమిళనాడులో 84 శాతం నమోదు కాగా, ఢిల్లీలో 63, తెలంగాణలో 79, ఏపీలో 50శాతం, యూపీలో 59శాతం కరోనా కేసులు మర్కజ్‌కు లింకులు ఉన్నవేనని నిన్న ప్రకటించిన బులిటెన్ లో పేర్కొన్నారు.

కరోనా వైరస్‌పై కేంద్ర వేగవంతంగా చర్యలు చేపడుతోందని అన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారు వైద్యుల సలహాలు, సూచనలు లేకుండా ఎలాంటి మందులు వాడవద్దని సూచించారు. ఇక ఏపీలోని విశాఖలో ఇప్పటి వరకూ కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులేవి నమోదు కాలేదని, ఏపీ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలపై ఆయన ప్రశంసించారు.

Next Story