ఎండలో అలా బయటకు వెళ్లి వచ్చిన వెంటనే చాలా మంది నేరుగా ఫ్రిజ్ దగ్గరకు వెళ్లి బాగా చల్లని నీరు తాగుతారు. వేడి నుంచి ఉపశమనం కోసం ఇంట్లో ఉన్నా సరే ఫ్రిజ్ వాటరే తాగుతారు. అయితే ఫ్రిజ్లో ఉండే చల్లటి నీటిని ఎక్కువ కాలం పాటు తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
ఆహారం తింటూ, తిన్న వెంటనే ఫ్రిజ్లో ఉండే చల్లటి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కాదు. ఇది రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. మలబద్ధకం, గ్యాస్టిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఫ్రిజ్ వాటర్ ఎక్కువగా తాగితే అవి గుండెలని వాగస్ నరాలపై ప్రభావం చూపిస్తాయట. దీని వల్ల గుండె పనితీరు నెమ్మదించి హృదయ స్పందన రేటు తగ్గి గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందట. అందుకే గుండె సమస్యలతో బాధపడేవారు ఫ్రిజ్ వాటర్కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు.
చల్లటి నీరు తాగితే పంటి చిగుళ్ల నొప్పి వస్తుంది. మరీ ఎక్కువగా తాగితే దంతాలు వదులుగా మారే అవకాశం ఉంది. ఫ్రిజ్లోని నీటిని తాగడం వల్ల కొందరికి జలుబు చేసే అవకాశం ఉంటుంది. మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. గొంతు ఇన్ఫెక్షన్స్ వచ్చే ముప్పు ఉంది. బరువు తగ్గాలని అనుకునేవారు ఫ్రిజ్ వాటర్ను తక్కువగా తీసుకోవాలి. వీటికి బదులు గోరు వెచ్చని నీరు తాగడం మంచిది.