భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24గంటల్లో 78,357 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Sep 2020 5:13 AM GMT
భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24గంటల్లో 78,357 కేసులు

భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం 70వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 78,357 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1,045 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 37,69,523 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 29,01,908 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 8,01,282 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 66,333 మంది మరణించారు. దేశంలో మరణాల రేటు 1.8శాతంగా ఉంది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. 62,57,571 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 39,52,790 కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్‌లో కరోనా ఉద్దృతి ఇలాగే కొనసాగితే.. మరికొద్ది రోజుల్లోనే భారత్‌ రెండో స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story