భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Aug 2020 5:29 AM GMT
భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ

భారత్‌లో కరోనా ఉద్దృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 60,975 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 848 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 31,67,324కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 24,04,585 కోలుకోగా.. 7,04,348 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 58,390 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 66 వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు.

దేశంలో రికవరీ రేటు 76 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.86శాతంగా ఉంది. సోమవారం ఒకే రోజు 9,25,383 శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 3,68,27,520 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడవ స్థానంలో ఉంది. 59,15,630 పాజిటివ్‌ కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 36,27,217 కేసులతో రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఈ నెల చివరి నాటికి భారత్‌ రెండో స్థానానికి చేరడం ఖాయం.

Next Story