రేపటి నుంచే డీఎస్సీ పరీక్షలు.. నిమిషం నిబంధన.. అభ్యర్థులు ఈ విషయాలు తెలుసుకోండి
ఏపీలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి రేపటి నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 30 వరకు పరీక్షలు జరుగుతాయి.
By అంజి
రేపటి నుంచే డీఎస్సీ పరీక్షలు.. నిమిషం నిబంధన.. అభ్యర్థులు ఈ విషయాలు తెలుసుకోండి
ఏపీలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి రేపటి నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 30 వరకు పరీక్షలు జరుగుతాయి. మొత్తం 12 కేంద్రాల్లో ఉదయం 9.30 - 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 -5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించమని డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ప్రకటించారు. మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. రోజు రెండు సెషన్లలో సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
అభ్యర్థుల హాల్ టికెట్పై ఫొటో లేకపోయినా తాజా ఫొటో, ఐడీని పరిశీలించి పరీక్షకు అనుమతించనున్నారు. అభ్యర్థులు పరీక్షకు ముందు రోజు క్విక్ రివిజన్ చేయండి. సమయానికి నిద్రించండి. టెన్షన్ పడకుండా పరీక్ష సమయానికి గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకునేలా ప్లాన్ చేసుకోండి. ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి చేరుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇన్నాళ్లు పడ్డ కష్టం వృథా అవుతుంది. అప్పుడు ఎంత బాధపడినా లాభం ఉండదు.
కావున ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకుని మైండ్ ప్రశాంతంగా ఉంచుకోండి. టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటేనే ఎలాంటి తప్పులు చేయకుండా సమాధానం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. చిన్న తప్పు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం సాధించాలంటే ప్రతి మార్కు ముఖ్యమని గుర్తుంచుకోండి. సమయపాలన మెయిన్టైన్ చేయండి. సమయానికి అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం ద్వారా వీలైనన్ని ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది.