ఆంధ్రప్రదేశ్లో జూన్ 6 నుంచి జులై 6 వరకు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ శుక్రవారం (మే 30) పాఠశాల విద్యాశాఖ హాల్ టికెట్లతో పాటు పరీక్సల షెడ్యూల్ను విడుదల చేయనుంది. పరీక్షలకు వారం రోజులే ఉంది కావున అభ్యర్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇన్ని రోజులు చదివిన పాఠ్యాంశాలను క్విక్ రివిజన్ చేయడం మంచిది. దీంతో చదివిన టాపిక్లు గుర్తుంటాయి.
గత ప్రశ్నా పత్రాలు, మోడల్ పేపర్స్ వీలైనన్నీ ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్టులను సైతం విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పరీక్షలో మేనేజ్మెంట్కు ఇది సాయపడుతుంది. అంతేకాదు ప్రశ్నలు ఎలా అడుగుతున్నారో కూడా తెలుసుకోవచ్చు. ఏదైనా ప్రశ్న తెలియకపోతే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉంది. ఎగ్జామ్లో ప్రతి మార్పు ఎంతో ముఖ్యం. అదే మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేయవచ్చు.