మిషన్‌ 2020 ప్రకటించిన ఇస్రో

By అంజి  Published on  1 Jan 2020 7:46 AM GMT
మిషన్‌ 2020 ప్రకటించిన ఇస్రో

బెంగళూరు: మిషన్‌ 2020ని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ ప్రకటించారు. చంద్రయాన్‌-3 ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందని కె.శివన్‌ పేర్కొన్నారు. చంద్రయాన్‌-3 ప్రయోగంలో ల్యాండర్‌, రోవర్‌ మాత్రమే ఉంటాయని తెలిపారు. కాగా 2019 సంవత్సరంలో ప్రయోగించిన చంద్రయాన్‌-2లోని ఆర్బిటర్‌ బాగానే పని చేస్తోందని శివన్‌ సృష్టం చేశారు. అందుకే ఆర్బిటర్‌ ప్రయోగించడం లేదన్నారు. తమిళనాడులోని తూత్తుకుడిలో రెండో అంతరిక్ష ప్రయోగం కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి భూసేకరణ కూడా పూర్తైందన్నారు. ఈ ఏడాది గగన్‌యాన్‌ ప్రాజెక్టును కూడా చేపడుతున్నామని శివన్‌ చెప్పారు. గగన్‌యాన్‌కు నలుగురు వ్యోమగాముల ఎంపిక పూర్తి అయిందని, ఈ నెల మూడో వారంలో రష్యాలో వ్యోమగాములు శిక్షణ తీసుకుంటారని తెలిపారు.

Next Story