'మీ మంత్రే ఒప్పుకున్నాడు'.. పాక్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్ఓలో భారత్ ధ్వజం
సోమవారం ఐక్యరాజ్యసమితిలో పహల్గామ్ ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగా లేవనెత్తింది. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్వోలో భారత్ ధ్వజమెత్తింది.
By అంజి
'మీ మంత్రే ఒప్పుకున్నాడు'.. పాక్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్ఓలో భారత్ ధ్వజం
సోమవారం ఐక్యరాజ్యసమితిలో పహల్గామ్ ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగా లేవనెత్తింది. పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలపై యూఎన్వోలో భారత్ ధ్వజమెత్తింది. విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజమ్ అసోసియేషన్ నెట్వర్క్ లాంచ్ సందర్భంగా భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి, రాయబారి యోజనా పటేల్ ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని "అన్ని రూపాల్లో" ఖండించారు. పాకిస్తాన్.. పేరు చెప్పకుండా, ప్రచారం కోసం, భారతదేశంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు దాని ప్రతినిధి బృందంపై ఫైర్ అయ్యారు. భారతదేశాన్ని "సరిహద్దు ఉగ్రవాద బాధితురాలు" అని అభివర్ణించిన పటేల్, పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తున్న చరిత్రకు సంబంధించి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ "బహిరంగ ఒప్పుకోలు"ను కూడా ఎత్తి చూపారు.
'టెర్రరిస్టులకు ఫండింగ్ చేసినట్టు పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా అంగీకరించారు. గ్లోబల్ టెర్రరిజాన్ని పాక్ పెంచి పోషిస్తున్నట్టు బహిర్గతమైంది' అని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని , కశ్మీర్ ప్రాంతాన్ని అస్థిరపరుస్తోందని విమర్శించించారు. "ప్రపంచం ఇకపై కళ్ళు మూసుకోలేదు" అని ఆమె అన్నారు. 26 మంది పౌరులు - ఎక్కువగా పర్యాటకులు - మరణించిన ఈ దాడి , 2019 పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్లో జరిగిన అత్యంత దారుణమైనది.
తాము యూఎస్, యూకే కోసమే ఉగ్రవాదులకు సాయం చేసినట్టు ఖ్వాజా ఆసిఫ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. గడిచిన 30 ఏళ్లుగా ఆ దేశాల కోసం పని చేశామని, అదే తాము చేసిన తప్పని, ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు. పాకిస్తాన్ను తిట్టడం అమెరికాకు సులువేనని, కానీ అదే అమెరికా తరఫున సోవియట్ యూనియన్పై యుద్ధం చేశామన్నారు. ఆప్ఘాన్లో పోరాటాలకూ ఉగ్రవాదులను యూఎస్వాడుకుందని పేర్కొన్నారు. .