మౌంట్ లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన తరువాత ఇండోనేషియాలోని బాలికి వెళ్లే డజన్ల కొద్దీ విమానాలు రద్దు చేశారు. అంతేకాకుండా ప్రయాణీకుల భద్రత దృష్ట్యా ఢిల్లీ నుండి బాలికి వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI2145 ను ఢిల్లీకి తిరిగి రావాలని సూచించారు.
తూర్పు ద్వీపం ఫ్లోర్స్లో ఈ విస్ఫోటనం సంభవించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. AI2145 విమానం ఢిల్లీలో సురక్షితంగా తిరిగి దిగిందని, ప్రయాణీకులు అందరూ దిగిపోయారని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రభావిత ప్రయాణీకులకు హోటల్ వసతి కల్పించడం ద్వారా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉచిత రీషెడ్యూలింగ్ కూడా ఉంటుందని ఎయిర్లైన్స్ తెలిపింది.