రష్యా దాడిలో భారత విద్యార్థి మృతి.. సానుభూతి ప్రకటించిన ఉక్రెయిన్
Ukraine offers sympathies to India on death of Indian student by Russian shelling. మంగళవారం ఖార్కివ్లో రష్యా జరిపిన దాడిలో మరణించిన భారతీయ విద్యార్థి మృతిపై ఉక్రెయిన్ బుధవారం తన సానుభూతిని
మంగళవారం ఖార్కివ్లో రష్యా జరిపిన దాడిలో మరణించిన భారతీయ విద్యార్థి మృతిపై ఉక్రెయిన్ బుధవారం తన సానుభూతిని వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితిలో ఉక్రెయిన్ శాశ్వత ప్రతినిధి సెర్గీ కిస్లిత్సా జనరల్ అసెంబ్లీ అత్యవసర సమావేశంలో మాట్లాడుతూ.. "రష్యన్ సాయుధ దళాల ఈ సవాలుకు భారతదేశానికి చెందిన ఒక విద్యార్థి ఉదాహరణగా మారినందుకు ఉక్రెయిన్ విచారం వ్యక్తం చేసింది. మేము భారతదేశానికి, విద్యార్థి బంధువులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము అని పేర్కొన్నారు.
"ఉక్రెయిన్పై రష్యా సాయుధ దాడికి ఉక్రేనియన్, విదేశీ పౌరులు బందీలుగా మారారు." ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో కర్ణాటకకు చెందిన 21 ఏళ్ల విద్యార్థి నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ మంగళవారం రష్యా దాడిలో మరణించాడు. ఉక్రెయిన్లో 18,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు అంచనా వేయబడింది. కొందరు హంగేరీ, పోలాండ్, రొమేనియా, మోల్డోవాలకు వెళ్ళారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన "ఆపరేషన్ గంగా" కింద అనేక వేల మంది భారతీయ పౌరులు ఆ దేశాల నుండి భారతదేశానికి తరలించబడ్డారు. రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజా మాత్రం.. పౌర ప్రాంతాలపై రష్యా దళాలు దాడులు చేస్తున్నాయని అన్న విషయాన్ని ఖండించారు. పోలాండ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 100 మంది భారతీయ విద్యార్థులను ఆ దేశ భద్రతా బలగాలు కొట్టి వెనక్కి పంపాయని బెలారస్ శాశ్వత ప్రతినిధి ఆరోపించారు.