బాలాకోట్.. మళ్లీ అలజడి

Terror camps at Pakistan's Balakot active again. పాకిస్థాన్ లోని బాలాకోట్ పై భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రయిక్స్ చేసి

By Medi Samrat  Published on  12 Dec 2020 12:51 PM GMT
బాలాకోట్.. మళ్లీ అలజడి

పాకిస్థాన్ లోని బాలాకోట్ పై భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రయిక్స్ చేసి అక్కడి తీవ్రవాదులను అంతం చేసింది. కొద్దిరోజుల పాటూ అక్కడి టెర్రర్ క్యాంపు కాస్త సైలెంట్ గా ఉన్నట్లు అనిపించినా మళ్ళీ అలజడి మొదలైంది. బాలాకోట్ లో టెర్రర్ సంస్థ జైషే మొహమ్మద్ తన క్యాంపులను మళ్లీ యాక్టివ్ చేసింది. యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తోందని, భారత్ పై దాడులకు వీరిని తయారు చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భారత్ కు, హిందుత్వకు, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తున్నట్టుగా ఒక వీడియో వెలుగులోకి వచ్చింది.

మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా ఇక్కడి క్యాంపులోనే ఉన్నాడని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. రవూఫ్ ను భారత్ కు వ్యతిరేకంగా నిర్వహించే ఆపరేషన్లకు హెడ్ గా మసూద్ అజార్ నియమించాడని అంటున్నారు. పుల్వామాలో సీఆర్ఫీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి సూత్రధారి మసూద్ అజార్. ఇప్పుడు భారత్ లో మరోసారి మారణహోమం సృష్టించాలని జైషే మొహమ్మద్ ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.


Next Story