శాంతి-ఉగ్రవాదం కలిసి ఉండలేవు.. చైనా నేల పైనుంచి తీవ్రవాదంపై గర్జించిన రాజ్‌నాథ్ సింగ్

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా వెళ్లారు.

By Medi Samrat
Published on : 26 Jun 2025 9:45 AM IST

శాంతి-ఉగ్రవాదం కలిసి ఉండలేవు.. చైనా నేల పైనుంచి తీవ్రవాదంపై గర్జించిన రాజ్‌నాథ్ సింగ్

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఓ) రెండు రోజుల సదస్సులో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా వెళ్లారు. ఈ సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ ఉగ్రవాదంపై తీవ్రస్థాయిలో గర్జించారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఆయన విస్తృతంగా వాదించారు.

SCO సమ్మిట్‌లో ప్రసంగిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేప‌ట్టిన‌ ఆపరేషన్ సింధూర్ గురించి కూడా ప్రస్తావించారు. ఎస్‌సిఓ రక్షణ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు చెంగ్డూకు రావడం ఆనందంగా ఉందన్నారు.

రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. మాకు ఆతిథ్యమిచ్చినందుకు మీ ఆతిథ్యానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. SCO కుటుంబంలో కొత్త సభ్యునిగా చేరినందుకు బెలారస్‌ని అభినందిస్తున్నాను. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని విధాన సాధనంగా ఉపయోగించుకుని ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నాయి. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలకు ఆస్కారం ఉండదని.. అలాంటి దేశాలను విమర్శించడానికి ఎస్‌సిఓ వెనుకాడకూడదని.. దేశాల మధ్య సంఘర్షణలను నివారించడానికి చర్చలు, సహకారం కోసం యంత్రాంగాలను రూపొందించడంలో ఎస్‌సిఓ సహాయపడుతుందని భారతదేశం విశ్వసిస్తోంది అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఒక‌ దేశం ఎంత పెద్దది, శక్తివంతమైనది అయినా ఒంటరిగా పనిచేయదు. దేశాలు తమ పరస్పర, సామూహిక ప్రయోజనం కోసం ఒకదానితో ఒకటి కలిసి పనిచేయాలనే భావనతో ఉండాలి.. ఇది మన ప్రాచీన సంస్కృత సామెత 'సర్వే జనా సుఖినో భవన్తు'ని ప్రతిబింబిస్తుంది.. దాని అర్ధం అందరికీ శాంతి, శ్రేయస్సు అని పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం అతిపెద్ద సవాళ్లు శాంతి, భద్రత, విశ్వాసం లేకపోవడం వంటి అంశాల‌తో ముడిపడి ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ఈ సమస్యలకు మూల కారణం రాడికలిజం, తీవ్రవాదం, ఉగ్రవాదం పెరగడమే. శాంతి-సంవృద్ధి మ‌రియు ఉగ్రవాదం కలిసి ఉండలేవు. ఈ సవాళ్లను పరిష్కరించడానికి నిర్ణయాత్మక చర్య అవసరం. మన సామూహిక భద్రత కోసం ఈ చెడుకు వ్యతిరేకంగా జ‌రిగే పోరాటంలో మనం ఐక్యంగా ఉండాలని సూచించారు.

22 ఏప్రిల్ 2025న, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై తీవ్రవాద బృందం 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' క్రూరమైన, హేయమైన దాడిని చేసింది. నేపాల్ పౌరుడితో సహా 26 మంది అమాయక పౌరులు మరణించారు. బాధితులను మతపరమైన గుర్తింపు ఆధారంగా ప్రొఫైల్ చేసి కాల్చి చంపారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింద‌ని వివ‌రించారు.

Next Story