దిగుమ‌తి చేసుకున్న ఫిష్ మసాలాను రీకాల్ చేసిన‌ సింగపూర్.. ఎందుకంటే..?

భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను రీకాల్ చేస్తున్నట్లు సింగపూర్ ప్రకటించింది.

By Medi Samrat  Published on  19 April 2024 9:14 AM GMT
దిగుమ‌తి చేసుకున్న ఫిష్ మసాలాను రీకాల్ చేసిన‌ సింగపూర్.. ఎందుకంటే..?

భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను రీకాల్ చేస్తున్నట్లు సింగపూర్ ప్రకటించింది. మసాలాలో అధిక స్థాయిలో పురుగుమందు ఇథిలీన్ ఆక్సైడ్ ఉందని ఆరోపిస్తూ ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది. హాంకాంగ్‌లోని ఫుడ్ సేఫ్టీ సెంటర్ జారీ చేసిన నోటిఫికేషన్ తర్వాత ఈ చర్య తీసుకోబడింది. ఆ నోటిఫికేష‌న్‌లో.. మసాలాలో అధిక పరిమాణంలో ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు నివేదించబడింది.

"ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నందున భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను రీకాల్ చేయడానికి హాంకాంగ్‌లోని ఫుడ్ సేఫ్టీ సెంటర్ నోటిఫికేషన్ జారీ చేసింది" అని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్పత్తులను భారీగా రీకాల్ చేయమని SFA దిగుమతిదారు SP ముత్తయ్య & సన్స్ Pteని ఆదేశించింది.

పురుగుమందుగా ఉపయోగించే ఇథిలీన్ ఆక్సైడ్ ఆహార ఉత్పత్తులలో ఉపయోగించడానికి ఖచ్చితంగా నిషేధించబడింది. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో ఇది అధికంగా ఉండటం వల్ల వినియోగదారులకు ఆరోగ్య ప్రమాదం పొంచి ఉంది. ఈ క్ర‌మంలోనే ఈ ఉత్పత్తులను వినియోగించిన, ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని SFA తన ప్రకటనలో పేర్కొంది. మరింత సమాచారం కోసం.. వినియోగదారులు వారు కొనుగోలు చేసిన స్థలాన్ని సంప్రదించాలని సూచించింది. ఎవరెస్ట్ ఈ ఎపిసోడ్‌పై ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.

Next Story