అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే బంధువులు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులు చనిపోయారు.

By Medi Samrat  Published on  27 Dec 2023 11:15 AM GMT
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే బంధువులు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ బంధువులు చనిపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం నివాసితులైన బాధితులు ఎఫ్‌ఎమ్ 1234 కూడలి వద్ద టెక్సాస్ హైవే 67పై ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం సంభవించింది, ఫలితంగా ఆరు మరణాలు సంభవించాయి. దీంతో హైవే 67ని అధికారులు మూసి వేశారు. టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీతో సహా స్థానిక అధికారులు ఈ సంఘటనపై చురుకుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తర టెక్సాస్‌లోని సోమర్‌వెల్/జాన్సన్ కౌంటీ లైన్ సమీపంలో హైవే 67లో సాయంత్రం 4 గంటల తర్వాత రద్దీ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పికప్ ట్రక్కు, మినీ వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయని.. వ్యాన్‌లోని ఆరుగురు వ్యక్తులు మరణించారని టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ తెలిపింది. "మేజర్ క్రాష్ US 67, జాన్సన్ కౌంటీ, నెమో, ప్రాంతం" అని టెక్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ట్వీట్ చేసింది. "రెండు వైపులా నుండి రోడ్డును మూసివేశాము. ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతకండి." అంటూ అధికారులు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ముగ్గురు బాధితులను ఆసుపత్రికి తరలించడానికి పారామెడిక్స్ హెలికాప్టర్‌లను పిలిచారు. కార్లలో ఒకదానిలో పిల్లలు ఉన్నారని అంటున్నారు. అయితే ఎవరైనా పిల్లలు చనిపోయారా అనేది స్పష్టంగా తెలియలేదు. గాయపడిన బాధితులను ఫోర్ట్ వర్త్‌లోని జాన్ పీటర్ హాస్పిటల్, టెక్సాస్ హెల్త్ హారిస్ మెథడిస్ట్ హాస్పిటల్‌కు తరలించారు.

Next Story