గోల్డెన్ టెంపుల్ ను కూల్చేయాలనుకున్న పాకిస్థాన్

భారతదేశం ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ లో భాగంగా దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని కూల్చేయాలని ప్రయత్నించింది. క్షిపణులు, డ్రోన్‌లతో ఈ ఆలయాన్ని కూల్చేయాలని లక్ష్యంగా చేసుకుంది.

By Medi Samrat
Published on : 19 March 2025 4:00 PM IST

గోల్డెన్ టెంపుల్ ను కూల్చేయాలనుకున్న పాకిస్థాన్

భారతదేశం ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సింధూర్ లో భాగంగా దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని కూల్చేయాలని ప్రయత్నించింది. క్షిపణులు, డ్రోన్‌లతో ఈ ఆలయాన్ని కూల్చేయాలని లక్ష్యంగా చేసుకుంది. 15వ పదాతిదళ విభాగం జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC) మేజర్ జనరల్ కార్తీక్ సి.శేషాద్రి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్లు స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్న అన్ని డ్రోన్‌లు, క్షిపణులను కూల్చివేసినట్లు వెల్లడించారు. స్వర్ణ దేవాలయం వంటి మతపరమైన ప్రదేశాలతో సహా ప్రజలు ఉన్న ప్రాంతాలను పాకిస్తాన్ టార్గెట్ చేస్తుందని భారత సైన్యం ముందుగానే ఊహించిందని మేజర్ జనరల్ అన్నారు.

స్వర్ణ దేవాలయం లక్ష్యంగా వచ్చిన అన్ని డ్రోన్లు, క్షిపణులను ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్లు విజయవంతంగా కూల్చివేశారని మేజర్ జనరల్ కార్తీక్ సి.శేషాద్రి తెలిపారు. స్వర్ణ దేవాలయానికి సంపూర్ణ వాయు రక్షణ కల్పించేందుకు ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను అదనంగా మోహరించామని మేజర్ జనరల్ కార్తీక్ సి.శేషాద్రి వివరించారు. మే 8న పాకిస్థాన్ మానవరహిత వైమానిక ఆయుధాలు, ప్రధానంగా డ్రోన్లు, సుదూర శ్రేణి క్షిపణులతో భారీ వైమానిక దాడికి పాల్పడిందని తెలిపారు. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ గన్నర్లు పాకిస్థాన్ సైన్యం పన్నాగాన్ని అడ్డుకుని, స్వర్ణ దేవాలయంపైకి వచ్చిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేశారన్నారు.

Next Story