'ఆపరేషన్ సింధూర్' అని ఎందుకు పెట్టారు..?.. అద్భుతంగా వివ‌రించిన శశి థరూర్

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్‌ ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్థాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించింది.

By Medi Samrat
Published on : 5 Jun 2025 2:19 PM IST

ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టారు..?.. అద్భుతంగా వివ‌రించిన శశి థరూర్

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్‌ ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్థాన్ మరియు పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించింది. ఆ తర్వాత పాకిస్తాన్ వైఖ‌రిని బహిర్గతం చేయడానికి.. ప్రపంచవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పడానికి భారత ప్రతినిధులు ప‌లు దేశాలలో ప‌ర్య‌టిస్తున్నారు. శశి థరూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తాజాగా అమెరికాకు చేరుకుంది. అక్కడ 'ఓరేషన్ సింధూర్' అని పేరు పెట్టడంపై వారిని ప్రశ్నించారు.

యుఎస్‌లోని నేషనల్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో థరూర్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ అద్భుతమైన‌ పేరు. కొంత‌మంది అమెరిక్ల‌కు బ‌హుశా దీని గురించి తెలియ‌క‌పోవ‌చ్చు. ఇది హిందూ సంప్రదాయంలో వివాహిత మహిళల నుదిటిపై పెట్టే ఎరుపు రంగు చిహ్నం అని ఆయ‌న‌ అమెరికన్లకు వివరించాడు. పెళ్లీడు సమయంలో సింధూర్‌ను వర్తింపజేస్తారని.. ఆ తర్వాత ప్రతిరోజు పెళ్లయిన మహిళలు త‌మ నుదుటిపై సింధూరం పెట్టుకోవ‌డం ద్వారా దీనిని పాటిస్తార‌ని, ఉగ్రవాదులు పహల్‌గామ్‌లో కొంత‌మంది మ‌హిళ‌ల‌ భర్తలను వారి క‌ళ్ల ముందే హతమార్చి వారి నుదుటిపై సింధూర్‌ను తొలగించారని, అందుకే ఇది ‘ఆపరేషన్ సిందూర్ కా బద్లా ఖూన్’ లాంటి ప‌తీకార చ‌ర్య అని ఆయన పేర్కొన్నారు.

ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు 26 మందిని హతమార్చారు. ఇందులో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు ఉన్నారు. దీని తరువాత దేశంలో చాలా ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. ఈ భయంకరమైన మారణకాండకు ప్రతీకారం తీర్చుకోవాలని ప్ర‌జ‌లు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారత్‌ మే 7 రాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. 9 తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతమొందించారు.

Next Story