గుడిలో నటికి వేధింపులు.. ఆశీస్సుల పేరుతో పిలిచి..

గుడిలోనే నటికి వేధింపులు ఎదురయ్యాయి. లిశాల్లిని కనరణ్‌కు గుడిలో వేధింపులు ఎదురయ్యాయి.

By Medi Samrat
Published on : 10 July 2025 6:49 PM IST

గుడిలో నటికి వేధింపులు.. ఆశీస్సుల పేరుతో పిలిచి..

గుడిలోనే నటికి వేధింపులు ఎదురయ్యాయి. లిశాల్లిని కనరణ్‌కు గుడిలో వేధింపులు ఎదురయ్యాయి. మలేషియా, సెపాంగ్‌లోని మారియమ్మన్ గుడిలో పూజలు చేసే భారత దేశానికి చెందిన పూజారి ఆమెను వేధించాడని తెలుస్తోంది. ఆశీస్సుల పేరుతో ఆఫీసుకు పిలిచి తప్పుగా ప్రవర్తించాడని, సంఘటన జరిగిన నెల తర్వాత లిశా ఆ వేధింపుల విషయాన్ని బయటపెట్టింది.

భారత సంతతికి చెందిన నటి, మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషాలినీ కనరన్ మరియమ్మన్ ఆలయంలో గత నెల ఈ ఘటన జరిగిందని వివరించింది. ఈ విషయం గురించి చెప్పడానికి ఇన్ని రోజులు తనకు ధైర్యం సరిపోలేదని, ఎంతో కష్టం మీద ధైర్యం కూడగట్టుకుని ఇప్పుడు చెబుతున్నానని తెలిపింది. "జూన్ 21వ తేదీన మా అమ్మ ఇండియాలో ఉంది. నేను ఒంటరిగా గుడికి వెళ్లాను. ప్రతీరోజూ వెళ్లే గుడికే వెళ్లాను. అక్కడి పూజారి పూజలు ఎలా చేయాలో నాకు చెప్పేవాడు. నాకు వాటి గురించి పెద్దగా తెలీదు కాబట్టి.. అతడి సాయాన్ని మెచ్చుకునే దాన్ని. ఆ రోజు అతడు నా దగ్గరకు వచ్చాడు. పూజలు అయిపోయిన తర్వాత తన ఆఫీస్‌కు రమ్మన్నాడు. చేతికి కంకణం కడతానని చెప్పాడు. నేను వెళ్లాను. అక్కడ నాతో చాలా తప్పుగా ప్రవర్తించాడు." అంటూ పోస్టులో వివరించింది.

Next Story