ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్
Kidnapping of 5 UN employees in South Yemen. ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్కు గురయ్యారు. ఫీల్డ్ మిషన్ తర్వాత అడెన్కు
By అంజి Published on 13 Feb 2022 3:29 AM GMT
ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్కు గురయ్యారు. ఫీల్డ్ మిషన్ తర్వాత అడెన్కు తిరిగి వస్తుండగా దక్షిణ యెమెన్లో ఐదుగురు ఐక్యరాజ్యసమితి సిబ్బంది కిడ్నాప్కు గురయ్యారని ఐక్యరాజ్యసమితి శనివారం తెలిపింది. సిబ్బంది విడుదల కోసం అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫీల్డ్ మిషన్ తర్వాత అడెన్కు తిరిగి వస్తుండగా దక్షిణ యెమెన్లో ఐదుగురు ఐక్యరాజ్యసమితి ఉద్యోగులు కిడ్నాప్కు గురయ్యారని ఐక్యరాజ్యసమితి శనివారం తెలిపింది. అబ్యాన్ గవర్నరేట్లోని ఉద్యోగులను శుక్రవారం అపహరించినట్లు యెమెన్లోని ఐరాస ఉన్నతాధికారి ప్రతినిధి రస్సెల్ గీకీ తెలిపారు.
సిబ్బంది విడుదల చేసేందుకు ఐక్యరాజ్యసమితి అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఉద్యోగులను సురక్షితంగా విడుదల చేయడంపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా నేతృత్వంలోని మిలటరీ సైన్యం 2015 నుండి యెమెన్లో ఇరాన్-అలైన్డ్ హౌతీ గ్రూపుతో పోరాడుతోంది. 2015లో హౌతీలు రాజధాని సనా నుంచి ప్రభుత్వాన్ని బహిష్కరించిన తర్వాత యెమెన్ అంతర్యుద్ధంలో సంకీర్ణం జోక్యం చేసుకుంది. ఈ సంఘర్షణ పదివేల మందిని చంపింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దీనివల్ల భయంకరమైన మానవతా సంక్షోభం ఏర్పడింది.