ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలి: చైనా

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కాశ్మీర్‌ వివాదం చరిత్రలో మిగిలిపోయిందని, ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం ఏకపక్ష చర్యలకు

By అంజి  Published on  7 May 2023 5:30 AM GMT
Kashmir,UN resolutions, China, Pakisthan, internationalnews

ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలి: చైనా

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య కాశ్మీర్‌ వివాదం చరిత్రలో మిగిలిపోయిందని, ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం ఏకపక్ష చర్యలకు దూరంగా ఉండాలని చైనా శనివారం పేర్కొంది. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం పాక్ చేరుకున్నారు. ఇది ఆ దేశానికి అతని మొదటి పర్యటన. ఆయన శనివారం తన పాకిస్థాన్ కౌంటర్ బిలావల్ భుట్టో జర్దారీతో సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన 'పాకిస్తాన్-చైనా వ్యూహాత్మక సంభాషణ' 4వ రౌండ్ ముగింపు సందర్భంగా ఇరు పక్షాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

రాజకీయ, వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ భద్రత, విద్య, సాంస్కృతిక సహా ద్వైపాక్షిక సంబంధాలు, సహకారం ఇరు దేశాల మంత్రులు చర్చించుకున్నారు. అయితే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలను కూడా సంభాషణ సమయంలో చర్చించారు. దక్షిణాసియాలో శాంతి, సుస్థిరతలను కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతను, వివాదాలన్నింటినీ పరిష్కరించాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు నొక్కిచెప్పాయని పేర్కొంది. ''కాశ్మీర్ వివాదం భారతదేశం, పాకిస్తాన్ మధ్య చరిత్ర నుండి మిగిలిపోయిందని, యూఎన్‌ చార్టర్, సంబంధిత భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం సరిగ్గా, శాంతియుతంగా పరిష్కరించబడాలి'' అని చైనా వైపు పునరుద్ఘాటించింది.

"ఇప్పటికే అస్థిర పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే ఏకపక్ష చర్యలను ఇరుపక్షాలు వ్యతిరేకించాయి" అని ప్రకటనలో పేర్కొంది. భారత కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ అండ్‌ కాశ్మీర్‌పై అనవసరంగా ప్రస్తావించినందుకు చైనా, పాకిస్తాన్‌లను భారత్ గతంలో విమర్శించింది. "మేము అటువంటి ప్రకటనలను స్థిరంగా తిరస్కరించాము. సంబంధిత అన్ని దేశాలకు ఈ విషయాలపై మా స్పష్టమైన సమాధానం గురించి బాగా తెలుసు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ & కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా, విడదీయరాని భాగాలుగా ఉంటాయి. మరే ఇతర దేశానికీ దీని గురించి వ్యాఖ్యానించడానికి అవకాశం లేదు'' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ గత సంవత్సరం రెండు సన్నిహిత మిత్రదేశాలు సంయుక్త ప్రకటనలో కాశ్మీర్ సమస్యను ప్రస్తావించినప్పుడు తెలిపింది.

Next Story