భారత్-భూటాన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం..పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా యూపీఐ సేవలు

డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది.

By -  Knakam Karthik
Published on : 21 March 2026 9:20 PM IST

International News, UPI, India, Bhutan, Digital India, Postal MoU, Digital Payments, Global UPI

భారత్-భూటాన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం..పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా యూపీఐ సేవలు

డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. మన దేశపు గర్వకారణం 'యూపీఐ' (UPI) సేవలు ఇప్పుడు పొరుగుదేశమైన భూటాన్‌కు కూడా విస్తరించాయి. భారత పోస్టల్ శాఖ మరియు భూటాన్ పోస్టల్ శాఖల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య నగదు బదిలీ ప్రక్రియ మరింత సరళతరం కానుంది.

యూపీఐ టెక్నాలజీతో పోస్టల్ నెట్‌వర్క్ అనుసంధానం:

యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (UPU)కు చెందిన 'పాస్‌ట్రాన్స్‌ఫర్' సిస్టమ్‌ను భారత యూపీఐతో అనుసంధానించడం ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనివల్ల సరిహద్దుల ఆవల ఉన్న పౌరులకు తక్కువ ఖర్చుతో, అత్యంత వేగంగా డిజిటల్ చెల్లింపులు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. కేవలం ఆర్థిక లావాదేవీలే కాకుండా లాజిస్టిక్స్, టెక్నాలజీ మరియు శిక్షణ వంటి కీలక రంగాల్లోనూ ఇరు దేశాలు సహకరించుకోనున్నాయి.

భూటాన్ అధికారులకు భారత శిక్షణ:

ఈ ఒప్పందంలో భాగంగా భూటాన్ పోస్టల్ అధికారులకు భారత్‌లోని ప్రతిష్ఠాత్మక 'రఫీ అహ్మద్ కిద్వాయ్ నేషనల్ పోస్టల్ అకాడమీ'లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే డిజిటల్ అడ్రస్ కోడ్ వంటి అత్యాధునిక సాంకేతికతను భూటాన్‌తో పంచుకోవడానికి భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫిలాటెలీ (తపాలా బిళ్లల సేకరణ) వంటి సాంస్కృతిక అంశాల్లోనూ పరస్పర సహకారం కొనసాగనుంది.

Next Story