హోర్ముజ్ జలసంధిపై ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్

హోర్ముజ్ జలసంధిపై నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో చర్చలు జరిపారు.

By -  Knakam Karthik
Published on : 24 March 2026 6:50 PM IST

International News, MiddleEastCrisis, Donald Trump, Narendra Modi, StraitOfHormuz, India US Relations

హోర్ముజ్ జలసంధిపై ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరియు అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధిపై నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో చర్చలు జరిపారు. పర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్‌తో కలిపే ఈ కీలక సముద్ర మార్గాన్ని తెరిచి ఉంచడం ప్రపంచ ఇంధన భద్రతకు అత్యంత అవసరమని ఈ సందర్భంగా ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.

ఈ చర్చల వివరాలను భారతదేశంలోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ 'X' వేదికగా ధృవీకరించారు. ఇరాన్‌తో చర్చలు ఫలప్రదంగా జరుగుతున్నాయని పేర్కొన్న ట్రంప్, ఆ దేశం హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిస్తే తమ దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తామని ప్రకటించిన మరుసటి రోజే ప్రధాని మోదీతో సంభాషించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story