ఘోర రైలు ప్రమాదం.. 60 మంది మృతి, మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్‌

At least 60 dead in DR Congo train accident. ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోల్వేజీ నగరానికి 200 కిలోమీటర్లు దూరంలో ఉన్న బయోఫ్వే గ్రామంలో

By అంజి  Published on  13 March 2022 4:17 AM GMT
ఘోర రైలు ప్రమాదం.. 60 మంది మృతి, మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్‌

ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కోల్వేజీ నగరానికి 200 కిలోమీటర్లు దూరంలో ఉన్న బయోఫ్వే గ్రామంలో "లోయలు ఉన్న ప్రదేశంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో కనీసం 60 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర రైలు సంస్థ, స్థానిక వర్గాలు తెలిపాయి. ఇక చాలా మంది పురుషులు, మహిళలు, చిన్న పిల్లలు గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఎన్‌సీసీ రైలు ఆపరేటర్‌లోని మౌలిక సదుపాయాల డైరెక్టర్ మార్క్‌ మన్యోంగా నడంబో తెలిపారు.

ఈ ప్రమాద ఘటన గురువారం రాత్రి 11:50 గంటలకు జరిగింది. 15 రైలు బోగీలు ఉన్న రైలు.. ఏడు రైలు బోగీలు బోల్తా పడ్డాయని అధికారులు తెలిపారు. 60 మంది మృతి చెందినట్లు ప్రావిన్షియల్ గవర్నర్ ఫిఫీ మసుకా చెప్పినట్లు స్థానిక మీడియా పేర్కొంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా ప్రమాద సమయంలో రైలులో 100 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ఇక్కడ కేవలం గూడ్స్‌ రైళ్లు మాత్రమే నడుస్తాయి. అయితే రోడ్లు సరిగ్గా లేకపోవడంతో చాలా మంది దూర ప్రయాణాలు చేసేందుకు గూడ్స్‌ రైళ్లలో ప్రయాణిస్తుంటారు.

రైలు ప్రమాద ఘటనలో "కొన్ని మృతదేహాలు లోయలలో పడిపోయిన బండ్లలో ఇంకా చిక్కుకున్నాయి" అని అధికారి చెప్పారు. రైలు 15 బోగీలతో రూపొందించబడిందని, వాటిలో 12 ఖాళీగా ఉన్నాయని, కోల్వేజీకి దగ్గరగా ఉన్న మైనింగ్ పట్టణం టెంకేకి ఉద్దేశించిన పొరుగు ప్రావిన్స్‌లోని లుయెన్ నుండి రైలు వస్తున్నట్లు అధికారి మాయోంగా చెప్పారు. "సోమవారం నాటికి ట్రాక్‌ను క్లియర్ చేయడానికి తన బృందం తీవ్రంగా కృషి చేస్తోంది" అని మన్యోంగా చెప్పారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో మాత్రం అతను చెప్పలేదు. దేశంలోని సరస్సులు, నదులలో ఓవర్‌లోడ్ చేయబడిన పడవలు ప్రమాదాలకు గురవుతున్నట్లు డీఆర్‌సీలో రైలు పట్టాలు తప్పడం సర్వసాధారణమైంది. ప్యాసింజర్ రైళ్లు లేక వెళ్లేందుకు వీలుగా రోడ్లు లేకపోవడంతో ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లేందుకు గూడ్స్ రైళ్లను ఉపయోగిస్తున్నారు.

Next Story