ప్రీ స్కూల్ వ‌ద్ద మాజీ పోలీసు అధికారి కాల్పులు.. 34 మంది మృతి

At least 34 killed in mass shooting at child daycare centre in Thailand.ఓ దుండ‌గుడు ఫ్రీ స్కూల్ వ‌ద్ద కాల్పుల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Oct 2022 8:47 AM GMT
ప్రీ స్కూల్ వ‌ద్ద మాజీ పోలీసు అధికారి కాల్పులు.. 34 మంది మృతి

విదేశాల్లో గ‌న్‌క‌ల్చ‌ర్ పెరుగుతోంది. దీంతో అనేక చోట్ల‌ కాల్పుల ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. థాయిలాండ్‌లోని ఓ ఫ్రీస్కూల్ వ‌ద్ద ఈ రోజు ఉద‌యం కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ దుండ‌గుడు ఫ్రీ స్కూల్ వ‌ద్ద కాల్పుల‌కు తెగ‌బ‌డ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు కనీసం 34 మంది మ‌ర‌ణించిన‌ట్లు స్థానిక మీడియా వెల్ల‌డించింది. మృతుల్లో అత్య‌ధికంగా చిన్నారులు ఉన్నారు.

నాక్లాంగ్ జిల్లాలోని నాంగ్ బు నాలాంపూ ప్రావిన్స్‌లోని చిల్డ్ర‌న్ డే కేర్ సెంట‌ర్‌లో ఈ ఉద‌యం ఓ వ్య‌క్తి కాల్పుల‌కు తెగ‌బ‌డ్డాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకునే స‌రికి దుండ‌గుడు ఓ పిక‌ప్ ట్ర‌క్ ఎక్కి పారిపోయాడు. ఈ కాల్పుల ఘ‌ట‌న‌లో 34 మంది మ‌ర‌ణించిన‌ట్లు పోలీసులు తెలిపారు. కొంత మంది గాయ‌ప‌డ్డార‌ని.. వారికి ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపారు. మృతుల్లో అత్య‌ధికులు చిన్నారులు ఉండ‌డంతో వారి త‌ల్లిదండ్రుల ఆర్త‌నాదాల‌తో ఆ ప్రాంతం ద‌ద్ద‌రిల్లింది.

ఈ ఘ‌ట‌న‌ను పాల్ప‌డింది మాజీ పోలీస్ అధికారి 34 ఏళ్ల పాన్య ఖ‌మ్రాప్‌గా గుర్తించారు. మాద‌క ద్ర‌వ్యాలు వాడిన‌ట్లు తేల‌డంతో ఏడాది కింద‌ట అత‌డిని విధుల నుంచి తొల‌గించారు. ఈ కేసుకు సంబంధించి శుక్ర‌వారం కోర్టు విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఈ విచార‌ణ‌కు అత‌డు హాజ‌రుకావాల్సి ఉంది.

కాగా.. గ‌తంలో థాయిలాండ్‌లోని న‌ఖోమా రాట్చెస్మా న‌గ‌రంలో 2020లో ఓ సైనికుడు కాల్పులు జ‌ర‌ప‌గా.. 29 మందిని మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

Next Story