భారత్, పాక్ యుద్ధాన్ని ట్రంప్ ఆపారు..నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి: వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ

డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ డిమాండ్ చేశారు.

By Knakam Karthik
Published on : 1 Aug 2025 12:00 PM IST

International News, America, President Donald Trump, WhiteHouse Secretary, India-Pak War

భారత్, పాక్ యుద్ధాన్ని ట్రంప్ ఆపారు..నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి: వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ

భారత్, పాక్ సహా చాలా యుద్ధాలను విరమింపజేసినందుకు తమ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని అమెరికా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ డిమాండ్ చేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటి వరకు ఇండియా-పాక్, థాయిలాండ్ - కంబోడియా, ఇజ్రాయెల్ - ఇరాన్, రువాండా - డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సెర్బియా - కొసావో, ఈజిప్ట్ - ఇథియోపియా మధ్య యుద్ధాలను ఆపాడు. సగటున నెలకు ఒక శాంతి ఒప్పందం లేదా కాల్పుల విరమణ చేయించాడు కాబట్టి ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి..అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వ్యాఖ్యానించారు.

ట్రంప్ జోక్యం చేసుకోకుంటే ఈ యుద్ధాల వల్ల భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేదని కరోలిన్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చి శాంతిని నెలకొల్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని కరోలిన్ డిమాండ్ చేశారు.

Next Story