ఇప్పటివరకూ 98 మంది భారతీయ యాత్రికులు మరణించారు : ప్రభుత్వం

ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియాకు వెళ్లిన వారిలో 98 మంది భారతీయ యాత్రికులు మరణించారని ప్రభుత్వం తెలిపింది.

By Medi Samrat
Published on : 21 Jun 2024 8:30 PM IST

ఇప్పటివరకూ 98 మంది భారతీయ యాత్రికులు మరణించారు : ప్రభుత్వం

ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ అరేబియాకు వెళ్లిన వారిలో 98 మంది భారతీయ యాత్రికులు మరణించారని ప్రభుత్వం తెలిపింది. అన్ని మరణాలు సహజ అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా ఉన్నాయని తెలిపింది. "ప్రతి సంవత్సరం, చాలా మంది భారతీయ యాత్రికులు హజ్‌ను సందర్శిస్తారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 1,75,000 మంది భారతీయ యాత్రికులు హజ్ కోసం సౌదీకి వెళ్లారు. ఇప్పటివరకు 98 మంది భారతీయ యాత్రికులు మరణించారు. కారణాలు సహజమైనవి." అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది మరణాల సంఖ్య 187గా నమోదైంది.

సౌదీ అరేబియాలోని మక్కాలో తీవ్రమైన వేడి కారణంగా ఈ సంవత్సరం హజ్ సమయంలో 1,000 మందికి పైగా యాత్రికులు మరణించారు. ఈజిప్టుకు చెందిన 658 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని సౌదీ అధికారులు తెలిపారు. జోర్డాన్, ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యునీషియా దేశాలకు చెందిన వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది యాత్రికులు కూడా తప్పిపోయినట్లు నివేదికలు వచ్చాయి. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో ఎంతో మంది పిట్టల్లా రాలిపోయారు.

Next Story