శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో భారీ పేలుడు.. 8 మంది దుర్మ‌ర‌ణం

సిరియాలోని హోంస్ న‌గ‌రంలోని అలవైట్‌లు అధికంగా ఉండే ప్రాంతంలో శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు పేలుడు సంభవించింది.

By -  Medi Samrat
Published on : 26 Dec 2025 7:40 PM IST

శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో భారీ పేలుడు.. 8 మంది దుర్మ‌ర‌ణం

సిరియాలోని హోంస్ న‌గ‌రంలోని అలవైట్‌లు అధికంగా ఉండే ప్రాంతంలో శుక్రవారం ప్రార్థనల సమయంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 8 మంది నమాజీలు మరణించగా, 18 మంది గాయపడ్డారు. ఏడాది క్రితం దేశంలో ఇస్లామిక్ అధికారులు అధికారం చేపట్టిన తర్వాత ప్రార్థనా స్థలంలో జరిగిన రెండో పేలుడు ఇది. అంతకుముందు డమాస్కస్‌లోని చర్చిలో ఆత్మాహుతి బాంబు పేలుడులో 25 మంది చనిపోయారు.

హోంస్ నగరంలోని వాడి అల్-దహబ్ ప్రాంతంలోని ఇమామ్ అలీ బిన్ అబీ తాలిబ్ మసీదులో పేలుడు సంభవించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ సనా నివేదించింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిని ఉటంకిస్తూ.. ఎనిమిది మంది మరణించారని, 18 మంది గాయపడ్డారని సనా నివేదించింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేలుడుకు పాల్పడ్డారని సిరియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

సిరియా అంతర్యుద్ధం సమయంలో హోంస్‌ తీవ్ర మతపరమైన హింసాకాండకు వేదికైంది. మంత్రిత్వ శాఖ మసీదు చుట్టూ భద్రతను పెంచింది. అధికారులు ఈ నేరపూరిత చర్యకు పాల్పడిన వారిని గుర్తించడానికి దర్యాప్తు, సాక్ష్యాలను సేకరించడం ప్రారంభించారని చెప్పారు.

Next Story