భూకంపాలతో దద్దరిల్లుతోన్న ఆప్ఘాన్‌.. 120 మంది మృతి, 12 గ్రామాలు ధ్వంసం

వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్‌ దేశం దద్దరిల్లుతోంది. ఆ దేశంలోని హెరాత్, ఇతర పశ్చిమ ప్రావిన్సులలో సంభవించిన భూకంపాల వల్ల కనీసం 120 మంది మరణించారు.

By అంజి  Published on  8 Oct 2023 2:16 AM GMT
international news, earthquakes, Afghanistan

భూకంపాలతో దద్దరిల్లుతోన్న ఆప్ఘాన్‌.. 120 మంది మృతి, 12 గ్రామాలు ధ్వంసం

వరుస భూకంపాలతో ఆఫ్ఘనిస్తాన్‌ దేశం దద్దరిల్లుతోంది. ఆ దేశంలోని హెరాత్, ఇతర పశ్చిమ ప్రావిన్సులలో సంభవించిన భూకంపాల వల్ల కనీసం 120 మంది మరణించారు. 1,000 మంది గాయపడ్డారని హెరాత్‌కు చెందిన స్థానిక అధికారి విలేకరులతో అన్నారు. సుమారు 1,000 మంది గాయపడిన వారిని ప్రావిన్స్ రాజధాని హెరాత్ నగరంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారి తెలిపారు. భూకంపాల కారణంగా హెరాత్‌లోని జిందాజన్, ఘోరియన్ జిల్లాల్లోని 12 గ్రామాలు ధ్వంసమయ్యాయని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ జాతీయ హెరాత్ ప్రాంతీయ డైరెక్టర్ మవ్లావి మూసా అషారీ తెలిపారు.

చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ ప్రకారం..శనివారం ఆఫ్ఘనిస్తాన్‌లో 6.2 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది. అంతకుముందు, దేశంలోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ నుండి ఒక ప్రకటనలో 15 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు అని తెలిపింది. అయితే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. బద్గీస్, ఫరా ప్రావిన్సుల నుండి ఎటువంటి నివేదికలు అందనందున మృతుల సంఖ్య పెరగవచ్చని ప్రకటన పేర్కొంది.

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:10 గంటలకు భూమి కంపించిందని, దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు. భూకంపాలలో అనేక ఇళ్లు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయని ప్రకటన తెలిపింది. బాధిత ప్రాంతాలకు రెస్క్యూ బృందాలు పంపబడ్డాయి, భూకంప బాధిత కుటుంబాలకు మానవతా సహాయం అందించడానికి సహాయ సంస్థలతో అవసరమైన ప్రయత్నాలను సమన్వయం చేయాలని ప్రాంతీయ ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు పేర్కొంది.

Next Story