వ‌ణికిస్తున్న క‌రోనా.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 March 2020 8:49 AM GMT
వ‌ణికిస్తున్న క‌రోనా.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణిస్తుంది. ఈ వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేలాది మంది చ‌నిపోగా.. చాలామంది దీని వ‌ల్ల అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. ఇక‌ మ‌న‌ దేశంలో మొత్తం 73 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లుగా కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించి వివరాలు కూడా పేర్కొంది.

వివ‌రాల ప్ర‌కారం.. ఢిల్లీలో 6, హర్యానాలో 14, కేరళలో 17, రాజస్థాన్‌లో 3, తెలంగాణలో 1, ఉత్తరప్రదేశ్‌లో 10, లడఖ్‌లో 3, తమిళనాడులో 1, జమ్మూకశ్మీర్‌లో 1, పంజాబ్‌లో 1, కర్ణాటకలో 4, మహారాష్ట్రలో 11 మందికి కరోనా పాజిటివ్ ఉంద‌ని తేలిందని తెలియ‌జేసింది. దేశంలో కరోనా పాజిటివ్‌ అని తేలిన వారిలో... 56 మంది దేశీయులేన‌ని.. ఇప్పటి వరకు మ‌న దేశంలోని విమానాశ్రయాల్లో 10,57, 506 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారని కేంద్ర మంత్రిత్వ శాఖ వివ‌రాల‌లో పేర్కొంది.

కాగా.. కరోనాపై పార్లమెంటులో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ.. 'ఇది ఆందోళనకర విషయమ‌ని.. ఇప్పటివరకు దేశంలో కరోనా సోకిన వారు 73 మంది ఉన్నారన్నారు. అత్య‌వ‌స‌ర‌ పరిస్థితులను అరికట్టడానికి అత్య‌వ‌స‌రంగానే స్పందించాల‌ని.. ఇటువంటి పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలను మానుకోవాల‌ని సూచించారు.

Next Story