హైదరాబాద్లో ఘనంగా అమెరికా కాన్సులేట్ వార్షికోత్సవం
US Consulate in Hyderabad observe anniversary of American flag at Paigah Palace.హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్
By తోట వంశీ కుమార్
హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. 14 ఏళ్లుగా బేగంపేటలోని పైగా ప్యాలస్లో అమెరికా కాన్సులేట్ కొనసాగుతోండగా త్వరలోనే నూతన భవనంలోకి మారనుంది. ఈ భవనంలో సిబ్బందికి ఇదే చివరి వార్షికోత్సవం కావడంతో ఎంతో వేడుకగా నిర్వహించారు. 2008 అక్టోబర్ 24న యూఎస్ కాన్సులేట్ కార్యాలయంలో తొలిసారి అమెరికా జెండా ఎగిరింది.హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో అమెరికా`భారత్ సంబంధాలను పర్యవేక్షిస్తుంటుంది.
త్వరలోనే అత్యాధునిక సదుపాయాలతో 300 మిలియన్ల డాలర్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనంలోకి మారనున్నారు. వచ్చే ఏడాది ఈ సమయానికి నూతన భవనంలో అమెరికా జెండాను ఎగురవేయనున్నారు.
We raised the American flag at US Consulate #Hyderabad at Paigah Palace fourteen years ago today. We begin a new chapter - we'll see you soon in the new space. pic.twitter.com/XEgJSm4ZMG
— Jennifer Larson (@USCGHyderabad) October 24, 2022
వార్షికోత్సవం సందర్భంగా కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ వీడియోను విడుదల చేశారు. అలాగే దీపావళి వేడుకల్ని సైతం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
Celebrating Diwali with my colleagues at the U.S. Consulate in #Hyderabad. Wishing a #HappyDiwali to all! pic.twitter.com/hoD8qyQkYO
— Jennifer Larson (@USCGHyderabad) October 24, 2022