హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి రోడ్‌షో.. ట్రాఫిక్‌ అడ్వైజరీ జారీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న రోడ్‌షో కోసం సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు.

By అంజి  Published on  25 April 2024 4:54 AM GMT
Traffic advisory, roadshow , CM Revanth Reddy , Hyderabad

హైదరాబాద్‌లో రేవంత్‌రెడ్డి రోడ్‌షో.. ట్రాఫిక్‌ అడ్వైజరీ జారీ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న రోడ్‌షో కోసం సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వయిజరీ జారీ చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇది వర్తిస్తుంది. PVNR ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్‌లు 121 నుండి 152 మధ్య రోడ్‌షో జరగనుంది. రోడ్‌షో దృష్ట్యా, ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని మెహదీపట్నం నుండి అరమ్‌గర్‌ రోడ్‌ వైపు కాకుండా మరోదారి చూసుకోవాలని పోలీసులు వాహనదారులను, ప్రజలను కోరుతూ ట్రాఫిక్ సలహా ఇచ్చారు.

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: తెలంగాణ సీఎం

కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అన్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజక వర్గంలో పార్టీ అభ్యర్థి డి.నాగేందర్‌ ప్రచారంలో భాగంగా జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ నుంచి కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఖైరతాబాద్ నుండి మాజీ మంత్రి, సిట్టింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే నాగేందర్ గత నెలలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ అతన్ని సికింద్రాబాద్ నుండి పోటీకి దింపింది. ఇక్కడ కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి చీఫ్ జి. కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించేందుకు రేవంత్‌రెడ్డి తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఈరోజు హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించనున్నారు.

Next Story