ఖ‌జానా జ్యువెల‌రీ దోపిడీ కేసులో నిందితులు అరెస్టు

ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో నిందితుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు మాదాపూర్ డీసీపీ వినిత్ తెలిపారు.

By Medi Samrat
Published on : 16 Aug 2025 3:04 PM IST

ఖ‌జానా జ్యువెల‌రీ దోపిడీ కేసులో నిందితులు అరెస్టు

ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో నిందితుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు మాదాపూర్ డీసీపీ వినిత్ తెలిపారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను గుర్తించ‌గా.. అందులో ఇద్దరిని అరెస్ట్ చేశామ‌ని తెలిపారు. దోపిడీ దొంగలు బీహార్‌కు చెందిన వారుగా గుర్తించామ‌ని.. నిందితులపై బీహార్‌లో దోపిడీ కేసులు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ఆశిష్, దీపక్ కుమార్ అనే ఇద్ద‌రు దొంగ‌ల‌ను అరెస్టు చేసినట్లు వెల్ల‌డించారు. 10 రోజుల క్రితమే ఖజానా జ్యూవెలర్స్‌లో దోపిడికి రెక్కీ చేసి.. ఆ త‌ర్వాత‌ కాల్పులు జరిపార‌ని.. నిందితులు ఇద్దరినీ పూణేలో అరెస్ట్ చేశామని.. వారి నుంచి 900 గ్రాముల వెండీ స్వాదీనం చేసుకున్నట్లు వెల్ల‌డించారు. వెస్ట్ బెంగాల్ , కోల్ కత్తాలో జ్యూవెలర్స్ షాప్‌లలో కూడా దోపిడీలు జరిగాయని.. పరారీలో ఉన్న కీలక నిందితుడుపై 10 కేసులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ కేసులో 10 కేజీల సిల్వర్ దోపిడీ చేయ‌గా.. 900 గ్రాముల సిల్వర్ రికవరీ చేశామని పేర్కొన్నారు.

జగద్గిరిగుట్టలో ఉంటూ ఈ దోపిడీకి ప్లాన్ చేశారు నిందితులు.. జగద్గిరి గుట్టలో అద్దెకు బైక్స్ తీసుకొని వచ్చి దోపిడీ చేశారు. అదే బైక్స్‌పై సిటీ దాటి వెళ్లిపోయిన‌ట్లు తెలిపారు. నిందితులు గోల్డ్ అనుకుని గోల్డ్ కోటెడ్ సిల్వర్‌ను ఎత్తుకెళ్లార‌ని తెలిపారు. ఇక్కడ ఉన్న‌ 20 రోజుల్లో ఏ పని దొరికితే ఆ పని చేశారని.. కార్మికులను పెట్టుకున్న‌ప్పుడు అన్ని చెక్ చేసి పెట్టుకోవాలని య‌జ‌మానుల‌కు సూచించారు.

ఖజానా లో దోపిడి చేసిన సివాని గ్యాంగ్‌గా గుర్తించారు. బీహార్‌లో శివాని గ్యాంగ్ దేశ వ్యాప్తంగా దోపిడీలు హత్యలు చేశారు. హైదరాబాద్. కలకత్తా, ఢిల్లీ, ముంబాయితో బీహార్‌లలో ఈ గ్యాంగ్‌ దోపిడికి పాల్ప‌డింది. ఈ గ్యాంగ్ జ్యువెలరీ షాప్ ల‌లో దోపిడి చేస్తుంటారు. వీరు తుపాకులు పట్టుకొని తిరుగుతారు. బీహార్ లో అక్రమంగా తుపాకులు కొనుగోలు చేసి వాడుతున్నారు.. ఒక్కసారి దోపిడీ చేసిన తరువాత మరోసారి ఆ ప్రాంతంలో శివాని గ్యాంగ్ దోపిడీ చేయదు.

Next Story