ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిస్ వరల్డ్ 2025 పైనల్ పోటీలు హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అత్యంత వైభవంగా జరిగాయి. థాయ్లాండ్కు చెందిన ఒపాల్ సుచత మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకుంది. 72 ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో మొదటిసారి థాయ్లాండ్ విజేతగా నిలిచింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ విద్యార్థి, ప్రొఫెషనల్ మోడల్ అయిన సుచత గట్టి పోటీ ఇచ్చి చివరి రౌండ్ తర్వాత విజేతగా నిలిచింది. ఆసియా, ఓషియానియాకు ప్రాతినిథ్యం వహిస్తూ ఆమె తన స్థైర్యం, ఆలోచన, స్పష్టతతో న్యాయమూర్తులను ఆకట్టుకుంది.
ఇథియోపియాకు చెందిన హస్సెట్ డెరెజె మొదటి రన్నరప్గా ఎంపికవ్వగా, పోలాండ్కు చెందిన మజా క్లాజ్డా రెండో రన్నరప్గా నిలిచారు. మార్టినిక్కు చెందిన ఔర్లీ జోచిమ్ మొదటి నాలుగు స్థానంలో నిలిచింది. ఇక మిస్ ఇండియా నందిని గుప్తా ప్రస్థానం టాప్-8 దశలో ముగిసింది.
హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గ్రాండ్ ఫినాలే జరిగింది. నెల రోజుల క్రితం ప్రారంభమైన ఈ పోటీలలో ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల నుంచి అందగత్తెలు పాల్గొనగా.. ఫైనల్ విజేతను ప్రకటించడంతో ముగింపు పడింది.