'మూసీ అభివృద్ధిని త్వరగా ప్రారంభించండి'.. అధికారులకు సీఎం ఆదేశం
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 19 మంగళవారం అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 20 Feb 2024 7:31 AM IST
'మూసీ అభివృద్ధిని త్వరగా ప్రారంభించండి'.. అధికారులకు సీఎం ఆదేశం
హైదరాబాద్ : మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 19 మంగళవారం అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నానక్రామ్గూడలోని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మూసీ నది సరిహద్దుల లొకేషన్ స్కెచ్, ఇతర ముఖ్య వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టును త్వరితగతిన ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పనులు ప్రారంభించే ముందు మూసీ నదిని పూర్తిగా శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని నది వెంబడి ఉన్న అన్ని చారిత్రక కట్టడాలను అనుసంధానం చేసే విధంగా మూసీ నది అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. త్వరితగతిన పనులు చేపట్టేందుకు అధికారుల మధ్య విభజన చేయాలని సూచించారు.
గత నెలలో లండన్, దుబాయ్లో పర్యటించిన ముఖ్యమంత్రి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించారు. దుబాయ్లో విదేశీ కంపెనీల ప్రతినిధులు, డిజైన్, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సంస్థలు, కన్సల్టెన్సీ నిపుణులతో ఆయన ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించారు. అంతకుముందు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత కంపెనీలు ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గ్లోబల్ ప్లానింగ్, ఇంజినీరింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కంపెనీ అయిన మెయిన్హార్డ్ గ్రూప్ ఉన్నతాధికారులు ఫిబ్రవరి 6న హైదరాబాద్లో రేవంత్ రెడ్డిని కలిశారు.